వెన్నెల వర్సెస్‌ గాడ్సే... రేపటి పోరులో గెలుపు ఎవరిదో?

కరోనా వల్ల వాయిదా పడ్డ సినిమాలు అన్ని కూడా ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ఈమద్య కాలంలో విడుదల అయిన సినిమా ల్లో చాలా వరకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ దక్కించుకుంటున్నాయి.

దాంతో ముందు ముందు రాబోతున్న సినిమాల విషయంలో చాలా పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ అయ్యింది.

వారంలో రెండు మూడు మీడియం రేంజ్ సినిమా లు విడుదల అవుతున్నాయి.కనుక ముందు ముందు రాబోతున్న సినిమా లు కూడా ఒకదానితో మరోటి తలపడి బాక్సాఫీస్ వద్ద నిలవాల్సి ఉంటుంది.

రేపు అంటే జూన్‌ 17వ తారీకున తెలుగు బాక్సాఫీస్ వద్దకు రెండు సినిమా లు రాబోతున్నాయి.

అందులో మొదటిది సాయి పల్లవి మరియు రానా నటించిన విరాటపర్వం ఒకటి కాగా సత్యదేవ్‌ నటించిన గాడ్సే మరోటి.

ఈరెండు సినిమాల్లో విరాట పర్వం సినిమాకు బజ్‌ ఎక్కువగా ఉంది.అలాగే సత్యదేవ్ నటించిన గాడ్సే సినిమా కూడా ఖచ్చితంగా మంచి కంటెంట్‌ ఓరియంటెడ్ మూవీ అంటూ ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉన్నారు.

రికార్డు బ్రేకింగ్‌ వసూళ్ల ను విరాటపర్వం దక్కించుకుంటుంది అంటూ చాలా మంది నమ్ముతున్నారు.

సత్యదేవ్ నటించిన గాడ్సే కూడా మంచి ఓపెనింగ్స్ ను దక్కించుకుని లాంగ్‌ రన్ లో భారీ గానే రాబట్టే అవకాశాలు లేక పోలేదు అంటున్నారు.

"""/"/ విరాట పర్వంకు ఉన్న క్రేజ్ నేపథ్యం లో భారీగా ఆ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారు.

గాడ్సే విషయంలో మాత్రం విడుదల కు కాస్త ఇబ్బందులు తలెత్తాయి.థియేటర్లు లభించగా గాడ్సే విడుదల ఉంటుందా లేదా అంటూ చివరి నిమిషంలో థియేటర్లు కన్ఫర్మ్‌ అవ్వడంతో విడుదలకు సిద్దం అయ్యింది.

ఈ రెండు సినిమా ల పోరులో గెలుపు ఎవరిది అనే విషయం ఆసక్తిగా మారింది.

రెండు సినిమాలు కూడా ఆయా జోనర్ ల్లో బెస్ట్‌ గా నిలవాలని అంతా కోరుకుందాం.

డ్రామాలొద్దు .. ఇమ్మిగ్రేషన్ విధానాలపై ట్రంప్‌కు షాకిచ్చేలా కమలా హారిస్ ప్రకటన