వెరైటీ టైటిల్ తో ఎంటర్టైన్ మెంట్ ని నమ్ముకొన్న సాయి ధరమ్ తేజ్

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ టైమ్ లోనే ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్న హీరో సాయి ధరమ్ తేజ్.

తేజు కి ఎంత వేగంగా కమర్షియల్ హీరోగా పేరు వచ్చిందో అంతే వేగంగా ఫెయిల్యూర్స్ కూడా వచ్చాయి.

వరుస హ్యాట్రిక్ విజయాలు అందుకున్న తేజు తరువాత ఏకంగా డబుల్ హాట్రిక్ అపజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.

అదే టైములో తన మార్కెట్ కూడా ఊహించని విధంగా పడిపోయింది.దీంతో తనకు అలవాటైన రెగ్యులర్ కమర్షియల్ జోనర్ సినిమాల నుంచి కాస్త బయటకు వచ్చి సాఫ్ట్ స్టోరీతో కిషోర్ తిరుమల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేక యావరేజ్ టాక్ తో బయటపడింది.

కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించుకున్న సినిమా తేజుకి కూడా కాస్తా బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి.

దీంతో రెట్టించిన ఉత్సాహంతో సాయి ధరమ్ తేజ్ ఈసారి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.

మారుతి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ యువి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఇదిలా ఉంటే సినిమాకి భోగి అనే టైటిల్ ని చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం.

ఇక ఈ సినిమాలో తేజు ప్లే బోయ్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తుంది.

అధ్యక్ష ఎన్నికల వేళ కలకలం.. కోవిడ్ బారినపడ్డ జో బైడెన్ , అర్ధాంతరంగా సభ నుంచి ఇంటికి