సీఎంను ఎదురిస్తున్న డాక్టర్..?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాతో మన ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాతో మరోసారి సక్సెస్ అందుకొని తన జోరును కొనసాగించాలని తేజు ప్రయత్నిస్తు్న్నాడు.

కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని కూడా లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు ఈ హీరో.

ప్రస్థానం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దేవా కట్టా డైరెక్షన్‌లో తేజు ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు కూడా సాగాయి.త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

కాగా ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.ఈ చిత్రంలో ఆమె చేయబోయేది ఓ లేడీ సీఎం పాత్రగా తెలుస్తోంది.

డాక్టర్ పాత్రలో తేజు సీఎం దురాగతాలను ఎలా ఎదుర్కొన్నాడనేది సినిమా కథ అని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

దేవా కట్టా పక్కా స్క్రిప్టుతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.తేజు కెరీర్‌లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది.

నివేథా పేతురాజ్ హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమా షూటింగ్‌ను ఏప్రిల్ 20 నుంచి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

అల్లం పంట సాగులో పోషక ఎరువుల యాజమాన్యంలో మెళుకువలు..!