మెగా హెల్త్ అప్డేట్.. పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్ తేజ్!

టాలీవుడ్ యంగ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు కొన్ని రోజుల కిందట ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.

తన స్పోర్ట్స్ బైక్ పై ఈ నెల 10 శుక్రవారం రోజున హైదరాబాద్ నగరంలో కేబుల్ బ్రిడ్జ్ - ఐకియా సమీపంలో ప్రయాణించగా అదుపుతప్పి రోడ్డుపై జారి పడటంతో ప్రమాదం జరిగి కింద పడ్డాడు.

అతడికి తీవ్ర గాయాలవ్వగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.వెంటనే తేజ్ ను అక్కడున్న కొందరు హాస్పిటల్ లో చేర్చారు.

ఇక వైద్యులు సాయి ధరమ్ తేజ్ కు చికిత్స ప్రారంభించగా.ఆ రోజు నుంచి ఇప్పటివరకు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా తను పూర్తిగా కోలుకున్నట్లు తెలిసింది.ప్రమాదం జరిగిన తర్వాత జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేర్చగా గత కొన్ని రోజుల నుండి సాయి ధరమ్ తేజ్ అపస్మారక స్థితిలో ఉండటంతో అతడికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని వైద్యులు తెలిపారు.

దీంతో అతడికి వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాసను అందించారు వైద్యులు.ప్రస్తుతం అతను కోలుకోగా ఊపిరి కూడా బాగానే పీల్చుకుంటున్నాడని తెలిసింది.

ఇక తాజాగా సాయి ధరమ్ తేజ్ ను ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ కు షిఫ్ట్ చేశారని తెలిసింది.

"""/"/ ఇక తనను మరో రెండు లేదా మూడు రోజుల వరకు హాస్పిటల్ లో ఉంచనున్నట్లు తెలుస్తుంది.

ఆ తర్వాత డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని వైద్యులు మెగా కుటుంబానికి తెలిపారని సమాచారం తెలిసింది.

ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నందుకు సంతోష పడుతున్నారు.

ఈ సింపుల్ చిట్కాను పాటించారంటే పసుపు దంతాలకు శాశ్వతంగా బై బై చెప్పవచ్చు!