వాయిస్ మెసేజ్ ద్వారా ఫ్యాన్స్ ను పలకరించిన తేజ్.. ఏం చెప్పాడంటే?

సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా తెరకెక్కన సినిమా రిపబ్లిక్.

ఈ సినిమా థియేటర్స్ లో విడుదల అయ్యి యావరేజ్ టాక్ కూడా తెచ్చుకోలేక పోయింది.

ఇక ఇప్పుడు రిపబ్లిక్ సినిమా ఓటిటీ లో విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతుంది.

జీ5 యాప్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది.ఈ సినిమాను మొట్ట మొదటి సారిగా దర్శకుడి వాయిస్ ఓవర్ ఉపయోగించి సన్నివేశాల వివరణతో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

ఇక ఈ సినిమా రెండు వర్షణ్‌లో ఉండబోతుంది.ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు ఇలాంటి స్ట్రీమింగ్ దక్కలేదు.

ఇక ప్రేక్షకుల ఛాయిస్ ప్రకారం ఏ వర్షన్ లో చూడాలంటే అలా చూడవచ్చు అని జీ5 చెబుతున్నారు.

ఇక ఓటిటీ స్ట్రీమింగ్ కు కూడా భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు.ఈ నెల 26న ఈ సినిమా జీ5 లో స్ట్రీమింగ్ కాబోతుంది.

ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ముందుకు వచ్చి మరి ఈ సినిమాను ప్రోమోట్ చేస్తున్నారు .

ఇక ఓటిటీ లో సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని మేకర్స్ నమ్ముతున్నారు.ఇక సాయి ధరమ్ తేజ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం అయ్యాడు.

"""/" / వాయిస్ మెసేజ్ ద్వారా ఆడియెన్స్ ను పలకరించాడు.ఈ సందర్భంగా తేజ్ తన వాయిస్ మెసేజ్ ను విడుదల చేశాడు.

ఈ వాయిస్ మెసేజ్ లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.''నేను మీ సాయి ధరమ్ తేజ్.

నా పైన మీరు చూపించిన అభిమానాలకు.నా కోసం చేసిన ప్రార్థనలకు థాంక్స్.

రిపబ్లిక్ సినిమా మీతో కలిసి థియేటర్స్ లో చూడడం కుదరలేదు.ఇక ఇప్పుడు జీ5 ద్వారా ఓటిటీలో ఈ సినిమాను నవంబర్ 26న విడుదల అవుతున్న సందర్భంగా మీతో పాటు నేను కూడా ఈ సినిమాను చూస్తాను.

"""/" / మీరు కూడా సినిమా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.జై హింద్ అంటూ ముగించాడు.

ఇక యాక్సిడెంట్ తర్వాత సాయి 2తేజ్ ఇంతవరకు బయటకు రాలేదు.మరి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని ఫ్యామిలీ అంత చెప్పడంతో సాయి ధరమ్ తేజ్  కేవలం వాయిస్ మెసేజ్ ద్వారా అభిమానులను పలకరించాడు.

మరి చూడాలి ఈ సినిమా ఓటిటి లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.

ప్రభాస్ కల్కి సినిమాలో అమితాబ్ విలనా..? లేదంటే ప్రభాస్ కి హెల్ప్ చేసే క్యారెక్టరా..?