‘సర్కారు వారి పాట’ బడ్జెట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్
TeluguStop.com
మహేష్బాబు 27వ చిత్రం సర్కారు వారి పాట పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోతున్న విషయం తెల్సిందే.
14 రీల్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్తో కలిసి మహేష్బాబు ఈ సినిమాను సొంతంగా నిర్మిస్తున్నాడు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా ఎంత బిజినెస్ చేస్తుందో, ఎంత వసూళ్లు రాబడుతుందో తెలియని పరిస్థితి.
కనుక బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తలు ఉండాలని దర్శకుడు పరశురామ్కు నిర్మాతలు సూచించారట.
మొదట అనుకున్న దాని ప్రకారం కంటే ఏకంగా 30 శాతం బడ్జెట్ను తగ్గించినట్లుగా తెలుస్తోంది.
మహేష్బాబు గత చిత్రాల బడ్జెట్తో పోల్చితే చాలా తక్కువగా ఈ సినిమాకు ఖర్చు చేయబోతున్నట్లుగా చెబుతున్నారు.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ సినిమాను రూపొందించడంతో పాటు బడ్జెట్ విషయంలో హద్దుల్లో ఉండాలని నిర్ణయించుకున్నారు.
"""/"/
మహేష్బాబు పారితోషికం కాకుండా సినిమాకు 20 కోట్ల లోపు బడ్జెట్ను కేటాయించాలని నిర్ణయించారు.
ఇక ఆ బడ్జెట్లో సగం సగం మొత్తంను మైత్రి మరియు 14 రీల్స్ వారు పెట్టబోతున్నారు.
అయితే సినిమా వాటదారుల్లో మాత్రం మహేష్బాబుది 50 శాతం కాగా ఆ రెండు నిర్మాణ సంస్థలది 50 శాతంగా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి మహేష్బాబు తన బిజినెస్ మైండ్తో పెట్టుబడి లేకుండానే 50 శాతం సినిమా వాటాను దక్కించుకున్నాడు.
సినిమా భారీ విజయాన్ని దక్కించుకుని మంచి వసూళ్లు వస్తే మహేష్బాబుకు 35 నుండి 50 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకుల అంచన.
ఏంటి హార్దిక్ అంత సింపుల్ గా ఆడేసావ్.. ‘నో లుక్ షాట్’ వైరల్