నేడు రైతుల ఖాతాలో రైతు బంధు జమ…

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో రబీపంటల సాగు ముమ్మరంగా సాగుతున్నందున రైతులకు( Farmers ) అవసరమైన పెట్టుబడి సాయం కోసం రైతుబంధు నిధులు జమ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు( Tummala Nageswara Rao ) అధికారులను ఆదివారం సాయంత్రం ఆదేశించారు.

శనివారమే మంత్రి అధికారులతో రైతుబంధు పధకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు మంత్రికి రైతుబంధు పధకం వివరాలను వెల్లడించారు.

ఇప్పటికే 40శాతం మంది రైతులకు నిధులు అందాయని తెలిపారు.27లక్షల మంది రైతుల ఖాతాలకు నిధులు జమ అయ్యాయని తెలిపారు.

మిగిలిన రైతులకు కూడా సోమవారం నిధులు జమ చేయాలని మంత్రి ఆదేశిం చారు.

సోమవారం నుండి అధికసంఖ్యలో రైతులకు రైతుబంధు చేరేలా చూడాలన్నారు.ఈ అంశంపై సంక్రాంతి తర్వాత మరోమారు సమీక్ష నిర్వహిస్తామన్నారు.

రైతులసంక్షేమం, వ్యవసాయం నూతన ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత అని అన్నారు.గత ప్రభుత్వం నుండి సంక్రమించిన క్లిష్టమైన ఆర్ధిక పరిస్థితి ఉన్నా కూడా ఈ ప్రభుత్వం రైతుబంధును సకాలంలో అందజేయ డానికి కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

తెలంగాణ రోడ్లపై లంబోర్ఘిని కారు కష్టాలు.. వీడియో వైరల్..