దారుణం.. ఊరేగింపులో మనుషుల మీదకు దూసుకొచ్చిన కారు.. చివరకు
TeluguStop.com
కారు వేగంగా నడపడాన్ని ఈ మధ్య చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు.కానీ ఇది చాలా ప్రమాదకరం.
కార్లు అనేవి మన సౌకర్యం కోసం కొనుగోలు చేశారు.జర్నీ సులభం అవుతుందని, లాగేజీ వంటివి ఉన్నప్పుడు పబ్లిక్ట ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడటం కంటే సొంతంగా కారు ఉండటం మంచిదనే అభిప్రాయంతో చాలా మంది కారు కొనుగోలు చేస్తారు.
చాలా మంది వాటిని బాగానే వాడుతారు.కానీ కొందరు రాష్ డ్రైవింగ్ చేసి ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తారు.
రెండేళ్ల కిందట హైదరాబాద్లోని ఓ ఫ్లైఓవర్పై ఓ వ్యక్తి కారును అత్యంత వేగంగా పోనిచ్చి ఒకరి ప్రాణాలను బలిగొన్న సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.
చివరికి అతని పోలీసులు అరెస్టు చేయడం, ఫ్లై ఓవర్ డిజైన్ బాగా లేదని ప్రభుత్వాన్ని విమర్శించడం తెలిసిందే.
ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరిలో ఇటీవల జరిగిన ఘటన కలకలం రేపింది.శాంతియుతంగా నిరసన నిర్వహిస్తున్న రైతులపై ఓ కేంద్ర మంత్రి కుమారుడు దారుణంగా కారు పోనిచ్చి నలుగురు ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాడు.
దీనిపై ప్రస్తుతం కేసు కొనసాగుతోంది.అలాంటి ఘటనే మధ్య ప్రదేశ్లో జరగబోయింది.
కానీ తృటిలో అక్కడి ప్రజలు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.మధ్యప్రదేశ్లోని బజారియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానిక ప్రజలంతా దసరా సందర్భంగా రోడ్డపైకి వచ్చి ఊరేగింపు నిర్విహిస్తున్నారు. """/"/
ఇంతలో అక్కడికి ఓ ఎస్యూవీ వాహనం వేగంగా దూసుకొచ్చింది.
కొంచెంలో పెద్ద ప్రమాదమే జరిగేది.కానీ అక్కడి ప్రజలు ప్రతిఘటించడంతో ఆ కారును రివర్స్లో తీసుకెళ్లి తప్పించుకున్నాడు.
అయితే అంతకు ముందే అందులో గంజాయి ఉందని పోలీసులు అనుమానించారట.దానిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.
ఆ కారు డ్రైవర్ వేగంగా తీసుకొచ్చి ఇలా ఊరేగింపు చేస్తున్న ప్రజలను ఢీకొట్టబోయాడు.
మళ్లీ ఇక్కడి నుంచి కూడా అతడు తప్పించుకున్నాడు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు హల్ చల్గా మారింది.
జుట్టు సమస్యలన్నిటికీ చెక్ పెట్టే మునగాకు షాంపూ.. ఇంతకీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?