గోపిచంద్ మలినేని క్రేజ్ మామూలుగా లేదుగా.. ఏకంగా ఆ హీరోతో సినిమా తీసే అవకాశం?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

గోపీచంద్ మలినేని పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకువచ్చే సినిమాలు క్రాక్, వీర సింహారెడ్డి.

ఈ రెండు సినిమాలతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకోవడంతోపాటు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు గోపీచంద్ మలినేని.

అంతేకాకుండా తాజాగా విడుదలైన వీర సింహారెడ్డి సినిమా హిట్ తర్వాత డైరెక్టర్ గోపిచంద్ మలినేని క్రేజ్ పెరిగిపోవడంతో పాటుగా స్టార్ దర్శకులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు గోపీచంద్.

"""/" / ఈ సినిమా తర్వాత మాస్ డైరెక్టర్ కి ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగిపోయింది.

డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఇండస్ట్రీకి వచ్చి కొన్ని ఏళ్ళు అయినప్పటికి సరైన గుర్తింపు దక్కింది మాత్రం క్రాక్ సినిమాతోనే అని చెప్పవచ్చు.

గత ఏడాది విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతోపాటు కలెక్షన్ సునామీని సృష్టించింది.

ఈ సినిమా తర్వాత ఇటీవల గత నెల సంక్రాంతి పండుగకు విడుదలైన వీరసింహారెడ్డి సినిమాతో మరోసారి సాలిడ్ హిట్ ను కొట్టి తాను టాప్ డైరెక్టర్ లిస్టులో ఉన్నాను అని చెప్పకనే చెప్పేసాడు గోపీచంద్ మలినేని.

"""/" / ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం డైరెక్టర్ గోపిచంద్ మలినేనికి ఒక స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చింది అంటూ ఒక వార్తా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఆ స్టార్ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి.గోపీచంద్ మలినేని టేకింగ్ కి మెగా స్టార్ సైతం ఫిదా అయ్యాడని అందుకే ఇప్పుడు ఈ దర్శకునికి మెగాస్టార్ నుండి పిలుపు వచ్చిందని సోషల్ మీడియాలో ఒక వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.

అంతేకాకుండా గోపిచంద్ తన సినిమాలో భారీ యాక్షన్ సీన్స్, మాస్ స్టెప్పులు ఉండేలా చూసుకుంటాడు.

దీనితో చిరంజీవికి కూడా ఎప్పటినుండో ఒక మాస్ కమర్షియల్ సినిమా చేయాలి అనుకుంటున్నాడట.

బోలా శంకర్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయాలని ఫిక్స్ అయినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.

ఆరో రోజు కలెక్షన్ల విషయంలో అదరగొట్టిన దేవర.. ఏకంగా అన్ని రూ.కోట్లు వచ్చాయా?