పూజా హెగ్దే పై ఈ వార్తల్లో నిజమెంత..?

బుట్ట బొమ్మ పూజా హెగ్దే టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస క్రేజీ సినిమాలు చేస్తూ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.

టాలీవుడ్ లో అయితే పూజా హెగ్దే హవా ఓ రేంజ్ లో కొనసాగుతుంది.

స్టార్ హీరో సినిమా అంటే చాలు ముందు పూజా హెగ్దే డేట్స్ కోసం ట్రై చేస్తున్నారు.

ఆమె కుదరకపోతేనే ఆ ఛాన్స్ వేరే వాళ్లకి ఇస్తున్నారు.తెలుగుతో పాటుగా తమిళ, హిందీ భాషల్లో పూజా హెగ్దే ఫుల్ ఫాం కొనసాగిస్తుంది.

అంతేకాదు అమ్మడు రెమ్యునరేషన్ కూడా భారీగా డిమాండ్ చేస్తుందని టాక్.ఇదిలాఉంటే ఈ క్రేజ్.

ఫాలోయింగ్ అమ్మడి తలకు ఎక్కించుకుందని అంటున్నారు.పూజా హెగ్దే ఈమధ్య కొద్దిగా అతి చేస్తుందని టాక్.

షూటింగ్ కు కూడా లేట్ గా వస్తుందని చెప్పుకుంటున్నారు.అయితే ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియదు కాని పూజా హెగ్దే పై ఈ రూమర్ వైరల్ గా మారింది.

ప్రస్తుతం పూజా హెగ్దే ప్రభాస్ రాధే శ్యాం, అఖిల్ బ్యాచిలర్ సినిమాలతో పాటుగా తమిళంలో విజయ్ బీస్ట్, త్రివిక్రం.

మహేష్ కాంబో సినిమాలో కూడా నటిస్తుంది.రాధే శ్యాం సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తుండటంతో ఆ సినిమా తర్వాత పూజా హెగ్దేకి బాలీవుడ్ లో కూడా వరుస క్రేజీ ఆఫర్లు వచ్చే ఛాన్సులు ఉన్నాయని చెప్పొచ్చు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నా తమ్ముడు.. రాజమౌళి కామెంట్లకు ఫిదా అవ్వాల్సిందే!