పార్టీ కోసం రూ.15 వేలు అప్పు.. ప్రామిసరి నోటు.. నెట్టింట వైరల్!

సాధారణంగా కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు ఎంతో మంది కొత్త సంవత్సరానికి ఎలా స్వాగతం పలకాలనీ ముందుగానే ఆలోచించి ఉంటారు.

కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా ముందుగానే కుటుంబ సభ్యులు లేదా స్నేహితులందరూ కలసి ఏ ప్రదేశాలకు వెళ్లాలి? ఏ విధంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలనే విషయాలను గురించి చర్చించుకుంటారు.

అందుకోసం డిసెంబర్ 31 తేదీ చాలా డబ్బులను కూడా ఈ పార్టీల కోసం ఖర్చు పెట్టడం మనం చూస్తూ ఉంటాం.

కానీ మన చేతిలో డబ్బులు లేకపోవడం, ఈ కరోనా సమయంలో కూడా నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి ఓ వ్యక్తి ఏకంగా ప్రాంసరీ నోటు పై "31స్ట్ నైట్ దావత్"కోసం 15000 రూపాయలు అప్పు చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇందుకు సంబంధించిన ప్రాంసరీ నోట్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ అందరినీ ఆకట్టుకుంది.

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఓ వ్యక్తి నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకోవడానికి తన దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

అయితే ఈ డబ్బులు కోసం ప్రాంసరీ నోటు పై ఏకంగా "31స్ట్ నైట్ దావత్"అని రాసి అప్పు చేయడం అందరిని ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరిని ఆకట్టుకుంటుంది.

ఈ ఫోటో చూసిన సదరు నెటిజన్లు న్యూ ఇయర్ వేడుకల కోసం ఈ విధంగా కూడా అప్పు చేస్తారా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఏదైనా అర్జెంట్ అయితే అప్పు చేస్తారు.కానీ ఈ విధంగా ప్రాంసరీ నోటు పై"31స్ట్ నైట్ దావత్"అని అని రాసి అప్పు చేయడం ఎక్కడా చూడలేదు అంటూ నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ఈ లడ్డూను రోజుకొకటి చొప్పున తింటే మోకాళ్ళ నొప్పులకు గుడ్ బై చెప్పవచ్చు..!