ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు విచారణ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది.

విచారణలో భాగంగా ఇవాళ సీఏ గోరంట్లను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో అదుపులోకి తీసుకున్న సీఏ గోరంట్ల బుచ్చిబాబును రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచగా.

మూడు రోజులపాటు కస్టడీకి ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది.ఈ మేరకు సీబీఐ వాదనలను ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

అనంతరం బుచ్చిబాబును శనివారం వరకు కస్టడీకి అనుమతి ఇస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది.

వైరల్ వీడియో: పానీ పూరి వ్యాపారి మిమిక్రీ చూస్తే ఫిదా..