ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్ కేసీఆర్ దూకుడు..!

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రచారం చేస్తున్నారు.ఇందులో భాగంగా ఇవాళ కూడా నాలుగు నియోజకవర్గాల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

ముందుగా ఖమ్మం జిల్లాకు వెళ్లనున్న ఆయన మధిర, వైరాలో జరగనున్న ఎన్నికల సభలకు హాజరుకానున్నారు.

తరువాత డోర్నకల్ లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు.అనంతరం సూర్యాపేటలో సభకు కేసీఆర్ హాజరవుతారు.

కాగా ఇవాళ్టితో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం పూర్తికానుంది.

కేసీఆర్ ఎన్నికల ప్రచారంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది.మరోవైపు కేసీఆర్ సభల నేపథ్యంలో గులాబీ శ్రేణులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.

అదేవిధంగా సభలకు భారీగా జనసమీకరణ చేస్తున్నారు.

మళ్లీ రేవ్ పార్టీ రగడ..అంతా మూణ్ణాళ్ల ముచ్చట..బిక్కుబిక్కుమంటున్న తారలు