విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటంలో తల్లితండ్రులు, గురువులు పాత్ర వెలకట్టలేనిది..

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, సర్టిపైడ్ లైఫ్ స్కిల్స్ ట్రైనర్ తిరుపతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మోటివేషన్ చేసారు.

విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చి దిద్దడంలో తల్లిదండ్రుల, గురువుల పాత్ర వెలకట్ట లేనిదని,ప్రతి విద్యార్ధి ఒక లక్ష్యం పెట్టుకోని దాన్ని సాధించడం కోసం నిరంతరం కఠోరంగా శ్రమ చేయాలని వివరించారు.

ప్రస్తుత సమాజంలో సామజిక మధ్యమాల ప్రభావం విద్యార్థుల పై, యువత పై విపరీతంగా ఉందని దాని బారినుంచి విద్యార్థులను బయటికి తీసువస్తే యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని దిశా నిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రవీందర్, ఇతర ఉపాధ్యాయులు పాల్గోన్నారు.

డైలీ మార్నింగ్‌ పాలల్లో ఈ పొడిని కలిపి తీసుకుంటే వెయిట్ లాస్ తో సహా అదిరే బెనిఫిట్స్ మీ సొంతం!