సిరిసిల్ల రగుడు ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం, ద్విచక్ర వాహదారుడికి గాయాలు!

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు అంబేద్కర్ చౌరస్తా ప్రధాన రహదారి సమీపంలో ద్విచక్ర వాహనదారుడు డివైడర్ ను ఢీకొని తీవ్ర గాయాలు అయ్యాయి.

వెంటనే స్థానికులు అంబులెన్స్ కు సమాచారం అందించడంతో క్షతగాత్రున్ని హుటాహుటిన స్థానిక జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు.

అయితే బాధితుడు గంభీరావుపేట నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపాడు.

అయితే ప్రమాదానికి ప్రధాన కారణం ద్విచక్ర వాహదారుడికి బీపీ తక్కువ అయ్యి కళ్ళు తిరగడంతో ప్రమాదం జరిగినట్లు బాధితుడు తెలిపాడు.

తమిళ్ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న అక్కినేని అఖిల్…