ములుగు జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి

ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.అదుపుతప్పిన బైక్ లారీ కిందకు దూసుకెళ్లిందని తెలుస్తోంది.

జంగాలపల్లిలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.మరొకరు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది.

గమనించిన స్థానికులు బాధిత వ్యక్తిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

రేవంత్ డేరింగ్ స్టెప్ .. ఆ ఇబ్బందులన్నీ తొలిగినట్టే ?