అన్నమయ్య జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.కేవీ పల్లి మండలం మఠంపల్లి వద్ద లారీ - తుఫాన్ వాహనం ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో పదకొండు మంది గాయపడ్డారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

బాధితులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు.అనంతరం రోడ్డుప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతులు కర్ణాటక రాష్ట్రం బెళగావి వాసులుగా గుర్తించారు.

అయితే తుఫాన్ వాహనం డ్రైవర్ నిద్ర మత్తులోకి జారడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

తిరుమలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.కాగా ప్రమాదం జరిగిన సమయంలో తుఫాన్ వాహనంలో మొత్తం 16 మంది ఉండగా తెల్లవారు జామున ఈ ఘటన జరిగిందని వెల్లడించారు.

ఖడ్గమృగం కొమ్ముల్లో రేడియోయాక్టివ్ మెటీరియల్ ఇంజెక్టు చేసిన సైంటిస్టులు..??