ఐసీసీ ప్రోమోలో రిషబ్ పంత్.. ఆసక్తి రేపుతున్న వీడియో

తరం మారే కొద్దీ క్రికెట్ ప్రేక్షకుల అభిరుచి మారుతోంది.ఒకప్పడు టెస్టులు ఆసక్తికరంగా ఉండేవి.

ఆ తర్వాత వన్డేలకు ప్రాధాన్యం పెరిగింది.ప్రస్తుతం క్రికెట్ లోకం అంతా టీ20లకే జై కొడుతోంది.

అందుకే ఐపీఎల్ అంతగా సక్సెస్ అయింది.ఇక క్రికెట్ ఆడే ప్రపంచ దేశాలలో ప్రస్తుతం ఆసక్తి పెరుగుతోంది.

ఎందుకంటే అతి త్వరలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ మొదలు కానుంది.దీంతో పలు దేశాలలో క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

చివరి ఓవర్ వరకు ఫలితం తేలే మ్యాచ్‌లు, ఫలితాలు ఎప్పుడైనా తారుమారయ్యే ఉత్కంఠ అంటే ప్రేక్షకులు ఎంతో ఆనందిస్తారు.

ఇలాంటి ఆనందాన్ని అందించేందుకు టీ20 ప్రపంచ కప్ సిద్ధమవుతోంది.దీనికి సంబంధించి ఐసీసీ విడుదల చేసిన ఓ ప్రోమో వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

దీనికి సంబంధించి ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్-2022 ఆస్ట్రేలియాలో జరగనుంది.

అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియాలోని వివిధ స్టేడియాల్లో మ్యాచ్‌లు ఉంటాయి.

దీంతో ఆ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్లను క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసింది.వీటిని కొనుగోలు చేసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు.

క్రికెట్ ప్రేక్షకులకు మరింత ఆకర్షించేందుకు ఓ ప్రోమో వీడియోను ఐసీసీ విడుదల చేసింది.

అందులో రిషబ్ పంత్ ఫొటోను పెట్టింది.ఇప్పటికే రిషబ్ తనదైన ఆటతీరుతో, ఓడిపోయే ఎన్నో మ్యాచ్‌లలో భారత్‌కు విజయాన్ని అందించాడు.

ధోని స్థానాన్ని భర్తీ చేసేది తానేనని నిరూపించుకున్నాడు.ఈ తరుణంలో అతడిని వీడియోలో పెట్టడంతో భారత్‌లోని అసంఖ్యాక క్రికెట్ అభిమానులను ఐసీసీ ఆకట్టుకుంటోంది.

టీ20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌లను నేరుగా వీక్షించేందుకు ఆస్ట్రేలియాకు రావాలని ఆహ్వానిస్తోంది.

యూఎస్ కంటే ఇండియా బెస్ట్.. ఢిల్లీలో జీవితం అద్భుతం.. అమెరికన్ కామెంట్స్ వైరల్..?