మృతుని కుటుంబానికి బియ్యం అందజేత..
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన దూమాల లింగయ్య వారం రోజుల క్రిందట మృతి చెందారు.
విలాసాగర్ భవన కార్మిక సంక్షేమ సంఘం తరపున వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబానికి 50 కేజీల బియ్యం వితరణ చేసినారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు దుమాల మల్లేశం, ఉపాధ్యక్షులు బొడ్డు శంకర్, గౌరవాధ్యక్షులు సుంకపాక దేవయ్య,గజ్జెల రాజు, సుంకపాక అనిల్, దోమకొండ కిరణ్,కల్లేపెళ్లి సతీష్, సుంకపాక విక్రమ్ బాబు,గజ్జెల బాబు,దుమాల బాబు, సుంకపాక తిరుపతి, దొబ్బల యాదగిరి,దావ కనకయ్య పాల్గొన్నారు.
సుమ బండారం బయటపెట్టిన యాంకర్…. సుమ పరువు మొత్తం పోయిందిగా?