పవన్ కళ్యాణ్ సున్నా కనిపెట్టారు అంటూ ఆర్జీవి సెటైర్లు..!!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో మొట్టమొదటిసారి పోటీ చేసిన జనసేన( Janasena ) డిపాజిట్లు కోల్పోవడం తెలిసిందే.

ఎనిమిది స్థానాలలో పోటీ చేయగా.ఎక్కడా కూడా గెలవలేదు.

కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం నిర్వహించిన సభలకు భారీ ఎత్తున ప్రజలు రావడం జరిగింది.

కానీ పోలింగ్ రోజు ఓట్లు మాత్రం పడలేదు.దీంతో తెలంగాణలో జనసేన అన్ని స్థానాలలో ఓడిపోయింది.

ఈ పరిణామంతో జనసేనపై తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క( Barrelakka ) సాధించిన ఓట్లు కూడా జనసేన పార్టీ తరపున పోటీ చేసిన 8 మంది అభ్యర్థులలో ఒకరు కూడా సాధించలేదని వ్యంగ్యంగా కామెంట్లు చేస్తూ ఉన్నారు.

"""/" / కాగా తాజాగా ఆర్జీవి( RGV ).పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో సున్నా కనిపెట్టారు అంటూ.

కామెంట్ చేశారు."మ్యాథ్స్ లో ఆర్యభట్ట సున్నాను కనిపెట్టారు.

రాజకీయాలలో పవన్ కళ్యాణ్ సున్నాను కనిపెట్టారు" అంటూ ట్వీట్ చేయడం జరిగింది.తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలలో జనసేన ఓటమి పాలయ్యాక ఆర్జీవి వరస పెట్టి సెటైర్లు వేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఆర్యభట్ట సున్నాతో పవన్ కళ్యాణ్.రాజకీయ ఫలితాలు సున్నానీ పోల్చి కామెంట్ చేయడం వైరల్ గా మారింది.

మరోపక్క తెలంగాణలో పవన్ కళ్యాణ్ అనవసరంగా పోటీ చేశారని చాలామంది జనసేన సానుభూతిపరులు కామెంట్లు చేస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల ఫలితల ప్రభావం కచ్చితంగా ఏపీలో ఉంటుందని.అంటున్నారు.

హుస్సేన్ సాగర్ లో హైదరాబాద్ సెయిలింగ్ వీక్ ప్రారంభం..