రేవంత్ రెడ్డి తీరు హంతకుడే సంతాపం తెలిపినట్లుంది..: కేటీఆర్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.నోట్ల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డి డబ్బులు పంచను అని ప్రమాణం చేయాలని సవాల్ విసరడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్లుందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ఎన్నో బాధలు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని చెప్పారు.తాము ఎవరికో బీ టీమ్ కాదని, తెలంగాణ ప్రజలకు తాము ఏ టీమ్ అని తెలిపారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు దూషించారని పేర్కొన్నారు.వందల మంది తెలంగాణ బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీనేనని ఆరోపించారు.

ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణలో ఏం తక్కువైందో చెప్పాలని ప్రశ్నించారు.ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారన్న కేటీఆర్ మళ్లీ రూ.

20 పెన్షన్ ఇస్తారా అని ఎద్దేవా చేశారు.

దేవర థర్డ్ సింగిల్ క్రేజీ అప్ డేట్ ఇదే.. ఆరోజే థర్డ్ సింగిల్ తో మోత మ్రోగనుందా?