సిట్ నోటీసులపై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.సిట్ నోటీసులు ఏమి తనకు అందలేదని చెప్పారు.

ఈ క్రమంలో సిట్ నోటీసులకు భయపడేది లేదని తెలిపారు.పేపర్ లీక్ వ్యవహారంలో తమ దగ్గర ఉన్న ఆధారాలను సిట్ కు ఇవ్వమని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్న రేవంత్ రెడ్డి అప్పుడు ఆధారాలు ఇస్తామని తెలిపారు.

పేపర్ లీక్ కేసును నీరు గారుస్తున్నారన్నారని విమర్శించారు.కేసీఆర్ గద్దె దిగేదాక తమ పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు.

సినిమా కోసం రెండేళ్లు తిరిగా.. భార్య జీతంతో బ్రతికా.. దిబాకర్ బెనర్జీ కామెంట్స్ వైరల్!