చర్చనీయాంశంగా రేవంత్ రెడ్డి- గురునాథ్ రెడ్డి భేటీ

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి భేటీ కొడంగల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా కొడంగల్ లో రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, ఆయన కుమారుడు, మున్సిపల్ ఛైర్మన్ జగదీశ్వర్ రెడ్డి కలిసారు.

కాగా బీఆర్ఎస్ లీడరైన గురునాథ్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఆయన రేవంత్ రెడ్డితో సమావేశం కావడంపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

వీడియో: మొసలినే వేటాడిన జాగ్వర్.. దీని ధైర్యం చూస్తే ఫిదా!