46 ఏళ్లుగా నీటిలోనే రెస్టారెంట్.. మునిగిపోయే స్థితిలో క్లోజ్

ప్రపంచంలో చాలా వింతలు, విచిత్రాలు జరుగుతూ ఉంటాయి.సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి.

ఇప్పుడు అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఓ రెస్టారెంట్ 46 ఏళ్లుగా నీటిలోనే ఉంది.

నీటిలోనే తేలియాడుతూ ఉంది.అయితే నష్టాల వల్ల ఆ హోటల్ ను మూసివేసే దిశగా నిర్వాహకులు చర్యలు చేపట్టారు.

దీంతో హోటల్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ రెస్టారెంట్ హాంకాంగ్ లో ఉంది.

1976లో ఈ రెస్టారెంట్ ను నిర్మించారు.ఎంతోమంది ప్రముఖులకు ఇది ఆతిధ్యం ఇచ్చింది.

కరోనా వల్ల లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఈ రెస్టారెంట్ నష్టాలబాట పట్టింది.

దీంతో రెస్టారెంట్ నిర్వహణకు డబ్బులు లేకుండా పోయాయి.క్వీన్ ఎలిజబెత్, హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రేజ్ వంటి సెలబ్రెటీలు గతంలో ఈ రెస్టారెంట్ కు వచ్చి బస చేసేవారు.

ఈ రెస్టారెంట్ ను కాపాడటానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మూసివేసే దిశగా నిర్వాహకులు ఉన్నారు.

ఈ రెస్టారెంట్ ను మూసివేయకుండా ఆర్థిక సహాయం చేయాలి చట్టసభ సభ్యులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు.

అయితే ఆర్ధిక సాయం అందకపోవడంతో మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నారు.కోవిడ్ సమయంలో లాక్ డౌన్ వల్ల ఈ రెస్టారెంట్ ను మూసివేయగా.

ఆ తర్వాత తెరచుకోలేదు.ఈ రెస్టారెంట్ నిర్వహణ కోసం కోట్ల రూపాయాల ఖర్చు అవుతోంది.

వాటిని భరించడం నిర్వాహకులకు భారంగా మారింది.దానిని తిరిగి ఓపెన్ చేయడానికి పెట్టుబడిదారులు కూడా ఎవరూ ముందుకు రాలేదు.

దీంతో హంకాంగ్ లోని అబెర్డీన్ నౌకాశ్రయం నుంచి హోటల్ ను తొలగించారు.