జాతీయ కబడ్డీ పోటీలకు అంపైర్ గా గరిడేపల్లి మండలవాసి…!

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన కొంపెల్లి వీరస్వామి టెక్నికల్ అఫీషియల్(అంపైర్)గా నియమితులైనట్లు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రకటించింది.

హైదరాబాదులో జరిగే 49వ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలకు ఆయన అంపైర్ గా వ్యవహరించనున్నారు.

ఈ పోటీలలో దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల క్రీడాకారులు హాజరవుతున్నట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా వీరస్వామి మాట్లాడుతూ కబడ్డీ పోటీలకు అంపైరుగా వ్యవహరించే అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ఇదేందయ్యా ఇది.. స్వర్గంలో మీటర్ స్థలం రూ.8,000… కొనుక్కోడానికి ఎగబడుతున్న జనం..?