నేతన్నల తలరాతను మార్చండని ఎమ్మెల్యేకి వినతి

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల పద్మశాలి చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సోమవారం చేనేత కార్మికులు వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేసిన చీరలు అమ్ముడుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రావలసిన పథకాలు గురించి వివరించారు.వెంటనే ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో చెరుపల్లి లక్ష్మయ్య,విడమ్ సాయి కిషోర్ నేత,సింగం కృష్ణ, గుర్రం సత్యనారాయణ, గంజి అంజయ్య,దోర్నాల కృష్ణబాబు,సింగం భాస్కర్, నరేష్,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

డబుల్ ఇస్మార్ట్ మూవీ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారా..?