కాలేజీ కోసం కలెక్టర్ కి వినతి

నల్లగొండ జిల్లా:మునుగోడు పరిసర ప్రాంతాల విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మునుగోడు మండల కేంద్రంలో ప్రభుత్వ ఇంటర్,డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ISO) ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ రాహుల్ శర్మకి మెమోరాండం సమర్పించారు.

అనంతరం విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ కేంద్రంగా ఉన్నప్పటికీ కనీసం ప్రభుత్వ ఇంటర్,డిగ్రీ కళాశాలలు లేకపోవడంతో విద్యార్థిని విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉన్నతాధికారులు స్పందించి ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ) సభ్యులు పాల్గొన్నారు.

డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్ధి వాల్జ్‌పై రిపబ్లికన్ల విమర్శలు.. నాడు ట్రంప్ చేత ప్రశంసలు