సికింద్రాబాద్ కంటోన్‎మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత

సికింద్రాబాద్ కంటోన్‎మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక బీఆర్ఎస్( BRS ) అభ్యర్థి పేరు ఖరారైంది.

ఈ మేరకు తమ పార్టీ అభ్యర్థిగా నివేదిత పేరును అధిష్టానం ఖరారు చేసింది.

దివంగత నేత సాయన్న అడ్డాగా పేరొందిన కంటోన్‎మెంట్ స్థానంలో ఆయన కుటుంబానికే టికెట్ ఇవ్వాలని కేసీఆర్( KCR ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే సాయన్న( Sayanna ) రెండో కుమార్తె నివేదిత ( Niveditha )పేరును ఆయన ఖరారు చేశారు.

అయితే ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించడానికి ముందే తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని నివేదిత ప్రకటించిన సంగతి తెలిసిందే.

స్థానిక బీఆర్ఎస్ నేతలు మరియు కార్యకర్తల అభీష్టం మేరకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

కాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన లాస్య నందిత రోడ్డుప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.

ఫ్రాన్స్‌లో భారత కొత్త రాయబారిగా సంజీవ్ కుమార్ సింగ్లా