ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకు ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో న్యాయస్థానం ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

కాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

అదేవిధంగా ఈ కేసులో సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అదేవిధంగా చిత్తూరు జిల్లా అంగళ్లులో నెలకొన్న అల్లర్ల కేసులోనూ రేపటి వరకు అరెస్ట్ చేయవద్దంటూ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.

కల్కి పార్ట్ 2 పై కీలక అప్డేట్ ఇచ్చిన నిర్మాత…అప్పుడే షూటింగ్ పూర్తి అంటూ?