తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ షెడ్యూల్ విడుదల

డిగ్రీ కోర్సులలో ఆన్ లైన్ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది.ఈ మేరకు దోస్త్ షెడ్యూల్ ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

మొత్తం మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది.ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రక్రియ జూన్ 10 వ తేదీ వరకు దోస్త్ రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది.

తరువాత ఈనెల 20 నుంచి జూన్ 11 వరకు వెబ్ ఆప్షన్ లు, జూన్ 16 నుంచి మొదటి విడతలో భాగంగా డిగ్రీ సీట్ల కేటాయింపులు ఉండనున్నాయని విద్యామండలి వెల్లడించింది.

జూన్ 16 నుంచి జూన్ 26 వరకు రెండో విడత దోస్ట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుండగా జూన్ 16 నుంచి 27 వరకు రెండో విడత దోస్ట్ వెబ్ ఆప్షన్లు ఉంటాయని పేర్కొంది.

జూన్ 30న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉండనుంది.అదేవిధంగా జూలై 1 నుంచి 5 వరకు మూడో విడత దోస్ట్ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ నిర్వహిస్తుండగా జూలై 10 న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉండనుంది.

తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి విరాళం ప్రకటించిన తారక్.. మంచి మనస్సంటూ?