30 ఏళ్ల క్రితం రేఖ విషయంలో జరిగిందే ఇప్పుడు రియా విషయంలో కూడా
TeluguStop.com
సుశాంత్ ఆత్మహత్యకి డిప్రెషన్ కారణమని పోలీసులు భావిస్తున్న ఆ డిప్రెషన్ కి కారణంగా అతని ప్రియురాలు రియా చక్రవర్తి అని మీడియా మొత్తం ఆమెని టార్గెట్ చేస్తుంది.
ఇక సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడనే విషయం బయటపడటంతో ఆ డ్రగ్స్ సుశాంత్ కి రియా ద్వారానే వచ్చేవని ఆధారాలు దొరకడంతో ఎన్సీబీ అధికారులు ఆమెని అరెస్ట్ చేశారు.
అలాగే రియా కారణంగా సుశాంత్ డిప్రెషన్ కి గురయ్యాడని, చివరికి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఆమెనే కారణం అంటూ సోషల్ మీడియాలో రియాని అందరూ పాయింట్ చేస్తున్నారు.
సుశాంత్ ఫ్యామిలీ కూడా రియా వైపే వేలెత్తి చూపిస్తుంది.రియా ఒక మంత్రగత్తే అంటూ ఆమె తన కొడుకు మీద ఏవో మంత్రాలు చేసి అతను మానసికంగా దెబ్బ తినడానికి కారణం అయ్యిందని సుశాంత్ ఫ్యామిలీ ఆరోపణ.
అలాగే అతని దగ్గర ఉన్న డబ్బు మొత్తం విచ్చలవిడిగా ఖర్చు పెట్టిందని కూడా విమర్శించారు.
ఏది ఏమైనా రియా చక్రవర్తి ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారంలో ఇరుక్కుంది.ఇదిలా ఉంటే వెటరన్ స్టార్ హీరోయిన్ రేఖ విషయంలో కూడా 30 ఏళ్ల క్రితం మీడియా రియాని దాడి చేసినట్లే మానసికంగా దాడి చేసిందని ఓ యూజర్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ గా మారింది.
రేఖ వ్యాపారవేత్త ముఖేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.పెళ్లైన ఏడు నెలలలోపే ముఖేష్ చనిపోయారు.
సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని అతను కూడా సుశాంత్ తరహాలోనే ఆత్మహత్య చేసుకున్నారు.
అతడు కూడా సుశాంత్ లానే చనిపోయే ముందు రోజు వరకు చాలా సంతోషంగా ఉన్నాడని అతడి సోదరుడు పోలీసులకు తెలిపాడు.
ముఖేష్ కూడా డిప్రెషన్తో బాధపడేవాడు.ఆ విషయం పెళ్లైన తర్వాత రేఖకు తెలిసింది.
ఈ విషయాల గురించి ఆమె రేఖ అన్టోల్డ్ స్టోరిలో వివరించింది.ముఖేష్ డిప్రెషన్ సమస్య కారణంగా కృంగిపోయేవాడని చాలా విపరీతంగా ప్రవర్తించేవడని రేఖ పేర్కొంది.
ఆ ప్రభావం తమ జీవితం మీద పడిందని, ఇద్దరం విడిపోవాలని అనుకున్న సమయంలో బిజినేస్లో నష్టాలు, డిప్రెషన్ కారణంగా అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పుడు కూడా ముఖేష్ కుటుంబం, మీడియా అంతా రేఖని టార్గెట్ చేసింది.ఆమెని మంత్రగత్తె అంటూ విమర్శించారు.
ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే రియా చక్రవర్తి కూడా ఉందని ఆ ట్విట్టర్ పోస్ట్ లో ఉంది.
రియాని సమర్దిస్తున్నవారు ఈ పోస్ట్ ని విపరీతంగా షేర్ చేస్తున్నారు.
దేవర రిలీజ్ కు ముందే రికార్డుల మోత.. యంగ్ టైగర్ పేరు మారుమ్రోగుతోందిగా!