సరికొత్త ఫీచర్లతో రెడ్ మీ స్మార్ట్ వాచ్..!

ప్రముఖ చైనీస్ దిగ్గజం షియోమీ కొత్తగా రెడ్ మీ స్మార్ట్ వాచ్ ను తీసుకొచ్చింది.

గతంలో రెడ్ మీ బ్యాండ్ అయితే ఉండేది.కానీ.

ఇప్పుడు స్మార్ట్ వాచ్ అయితే ఉండేది కాదు.మొట్టమొదటి సారిగా రెడ్ మీ స్మార్ట్ వాచ్ సెగ్మెంట్ లోకి అడుగు పెట్టడం జరిగింది.

అదిరిపోయే ఫీచర్లతో ఈ స్మార్ట్ వాచ్ ను రెడ్ మీ తీసుకొచ్చింది.ఈ స్మార్ట్ వాచ్ ను బడ్జెట్ స్మార్ట్ వాచ్ అని కూడా చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం ఈ స్మార్ట్ వాచ్ ధర 269 యువాన్లు ఉంది.అంటే మన భారతదేశ కరెన్సీ ప్రకారం సుమారు రూ.

3 వేలకు మార్కెట్లో లభిస్తుంది.ఈ వాచ్ మొత్తం మూడు కలర్లలో అందుబాటులో ఉంది.

ఎలిగెంట్ బ్లాక్, ఇంక్ బ్లూ, ఐవోరీ బ్లూ కలర్లలో ఇది లభిస్తోంది.ఈ స్మార్ట్ వాచ్ లో ఉన్న అధునాతన ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రెడ్ మీ వాచ్ లో పిక్సెల్ డెన్సిటీ 324dp ఉంటుంది.అలాగే 2.

5D టెంపర్డ్ గ్లాస్ స్క్రీన్, 1.4 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్ ఉంది.

ఇంకా ఈ వాచ్ బ్యాటరీ సమార్థ్యం 230mah గా ఉండగా.ఇందులో హార్ట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, హార్ట్ రేట్ వంటి పీచర్లు అనేకం ఉన్నాయి.

ఈ సమాచారాన్ని 30 రోజుల రిపోర్టు రూపంలో కూడా అందిస్తుంది.అలాగే 120 వాచ్ ఫేసెస్, ఇండోర్, అవుట్ డోర్ రన్నింగ్, ఇండోర్, అవుట్ డోర్ సైక్లింగ్, స్విమ్మింగ్, వాకింగ్ వంటి స్పోర్ట్ మోడ్స్ కూడా ఇందులో ఉన్నాయి.

ఇది పూర్తిగా వాటర్ రిసిస్టెంట్ వాచ్.నీటిలో 50 మీటర్ల లోపు వరకు ఇది పనిచేస్తుంది.

ఆండ్రాయిడ్ 5.0, ఆ పై బడిన ఐవోఎస్ 10.

0 ప్లస్ ఆ పై బడిన ఫోన్లకు దీన్ని పెయిర్ చేసుకోవచ్చు.దీని బరువు కేవలం 35 గ్రా.

మాత్రమే ఉండడం విశేషం.

అమరావతిపై కీలక నిర్ణయం.. శ్వేతపత్రం విడుదల