అంగారక గ్రహం పుట్టుక వెనుక గల రహస్యం ఏమిటో తెలుసా..?

గ్రహాలలో ఒకటిగా, గ్రహాలకు సేనాధిపతిగా, ఉగ్ర స్వభావవుడిగా అంగారక గ్రహాన్ని పరిగణిస్తారు.ఈ సౌర కుటుంబంలో నాలుగవ గ్రహమైన అంగారక గ్రహాన్ని కుజ గ్రహం అని కూడా పిలుస్తారు.

ఈ గ్రహం ఎంతో ఎరుపు రంగును కలిగి ఉండటం వల్ల దీనిని అరుణగ్రహం అని కూడా పిలుస్తారు.

అయితే ఈ అంగారక గ్రహం ఎరుపు రంగును కలిగి ఉండటానికి మన పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి.

అయితే అంగారక గ్రహం ఈ విధంగా ఎరుపు రంగులో ఉండటానికి గల కారణాలు, ఆ పురాణ కథలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

ఈ అంగారక గ్రహం పుట్టుక గురించి మన హిందూ పురాణాలలో మూడు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

అంగారకుడు సాక్షాత్తు ఆ విష్ణుభగవానుడు, భూదేవికి పుట్టిన సంతానమేనని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది.

ఒకరోజు ఆ విష్ణుభగవానుడు చెమట చుక్క భూమి పై పడటం వల్ల భూమి నుంచి ఒక బాలుడు జన్మిస్తాడు.

ఆ బాలుడు పెరిగి పెద్దయిన తర్వాత తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఒక గ్రహంగా మారుతాడు.

ఆగ్రహమే కుజ గ్రహం అని పద్మపురాణం తెలియజేస్తోంది. """/" / స్కంద పురాణం ప్రకారం అంధకాసురుడు అనే రాక్షసుడుకి ఆ పరమశివుడు ఒక గొప్ప వరం ఇచ్చాడు.

అంధకాసురుడి రక్తం బొట్టు నుంచి 100 మంది రాక్షసులు పుట్టే విధంగా వరం పొందిన అంధకాసురుడి నుంచి ప్రజలను రక్షించాలంటే అంధకాసురుడిని సంహరించాలని ఆ పరమశివుడు రాక్షసునితో పోటీ పడ్డాడు.

ఈ భయంకరమైన పోరాటంలో ఆ పరమేశ్వరుడి చెమట ధారలుగా ప్రవహించి ఆ చెమటల వేడికి ఉజ్జయిని నగరం చీలికగా ఏర్పడటంవల్ల అంగారక గ్రహం ఏర్పడిందని స్కంధ పురాణం చెబుతోంది.

ఈ విధంగా భూమి చీలికలో నుంచి పుట్టడం వల్ల సాక్షాత్తు భూదేవి తన సొంత కొడుకు కుజ గ్రహాన్ని భావించిందని ఈ పురాణం తెలియజేస్తుంది.

ఎట్టకేలకు ఆ పరమశివుడు అంధకాసురుడని సంహరించి కొత్తగా సృష్టించిన మరొక అంగారడు రాక్షసుడు రక్తపు చుక్కలను గ్రహించాడు.

అందుకోసమే కుజుడు ఎరుపురంగును పోలి ఉంటాదని మరొక కథనం అంగారకుని పుట్టుక గురించి తెలియజేస్తోంది.

ఎండాకాలంలో షుగర్ ఉన్నవారు.. చెరుకు రసం తాగితే జరిగేది ఇదే..!