ధూమ్ సినిమా స్టైల్ లో దోపిడీ... ఏకంగా 7800 కోట్లు

ధూమ్ సినిమా చూసిన వారికి భారీ దొంగతనాలు ఎలా జరుగుతాయో తెలుస్తుంది.అయితే పెద్ద పెద్ద సెక్యూరిటీ ఉండే చోట దొంగతనాలు చేయాలంటే ఆ స్థాయిలో రిస్క్ చేయాల్సిందే అని అందరూ అనుకుంటారు.

  చిన్న  చిన్న దొంగతనాలకు రిస్క్ చేస్తున్న ఈ రోజుల్లో అసలు భారీ దొంగతనాలు గురించి ఆలోచన కూడా చేయరు.

కానీ  విదేశాలలో మాత్రం భారీ దొంగతనాలని చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారు.టెక్నాలజీ వచ్చిన తర్వాత కొన్ని చోట్ల దొంగతనాలని సులభంగా చేసేస్తున్నారు.

ఇప్పుడు అలాంటి సంఘటన జర్మనీలో జరిగింది.ఇద్దరు దొంగలు ఓ మ్యూజియం లో ఏకంగా 7800 కోట్ల విలువ చేసే ఆభరణాలు ఎత్తుకుపోయారు.

 జర్మనీ డ్రెస్డన్ మ్యూజియంలో గ్రీన్ వాలెట్ భవనంలో ఈ సంఘటన జరిగింది.భవనానికి విద్యుత్ సరఫరా కట్ చేసి ఈ దోపిడీకి పాల్పడ్డారు.

దోచుకున్న సొత్తుతో దర్జాగా ఆడీకారులో ఉడాయించారు.కొన్ని వందల ఏళ్ల నాటి నగలు చోరీకి గురయ్యాయని అక్కడి పోలీసులు భావిస్తున్నారు.

జర్మనీలోనే అత్యంత పురాతనమైన, అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన మ్యూజియంలో ఈ చోరీ జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

  సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.  రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఒకసారి రష్యాకు చెందిన రెడ్ ఆర్మీ ఈ మ్యూజియాన్ని దోచుకుంది.

2000 సంవత్సరంలో ఆ సొమ్మును జర్మనీకి తిరిగొచ్చింది.మరల అదే స్థాయిలో  జరగడం విశేషం.

బాహుబలి2 స్థాయిలో ఆ సీక్వెల్స్ మెప్పు పొందుతాయా.. దేవర2, కల్కి2, పుష్ప2 పరిస్థితేంటి?