తెరపైకి 'ఆర్సీ15' మరో టైటిల్.. శంకర్ మార్క్ కు తగ్గ టైటిల్ ఇదే!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రెసెంట్ ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందాడు.

ఈయన ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు.ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేయడంతో ముందు నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆ అంచనాలు నిజం అయ్యేలా బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచి 1100 కోట్లు కొల్లగొట్టింది.

ఇందులో చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటించారు.ఈ సినిమా తో హిట్ కొట్టిన రామ్ చరణ్ అదే జోష్ లో మరో అగ్ర డైరెక్టర్ శంకర్ తో సినిమా స్టార్ట్ చేసాడు.

అయితే ఇండియన్ అగ్ర దర్శకులు అయినా రాజమౌళి, శంకర్ లతో ఈయన బ్యాక్ టు బ్యాక్ పని చేసి రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు.

ఇలా పని చేసిన ఏకైక హీరో ఇతడే అని చెప్పాలి.మెగా ఫ్యాన్స్ అంతా ఆర్సీ 15 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ఇటీవలే అమృత్ సర్ లో ఈ సినిమా షూటింగ్ ముగించుకుంది.ఆ తర్వాత వైజాగ్ బీచ్ లో షూటింగ్ జరుపుకుంది.

ఇక ఇక్కడ కూడా షూటింగ్ ముగించు కున్నారు.ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న కూడా ఇంత వరకు టైటిల్ అయితే రివీల్ చేయలేదు.

అయితే ఈ సినిమా టైటిల్ ఇది అంటూ సోషల్ మీడియాలో మాత్రం వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

మొన్నటి వరకు ఈ సినిమాకు అధికారి అనే టైటిల్ వినిపించింది. """/"/ అయితే ఇప్పుడు మరో క్రేజీ టైటిల్ వినిపిస్తుంది.

ఇది శంకర్ మార్క్ టైటిల్ లాగానే ఉంది.ఆ టైటిల్ అంతంతే.

'సిటిజన్' అని వార్త వైరల్ అయ్యింది.ఈ టైటిల్ కూడా ఆయన మార్క్ టైటిల్ లాగ అనిపిస్తుంది.

మరి ఈ రెండు టైటిల్స్ లో మేకర్స్ ఏది ఫిక్స్ చేస్తారో చూడాలి.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు.ఇక దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాలో కీలక పాత్రల్లో సునీల్, అంజలి వంటి వారు నటిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ..!!