రాయపాటి ఇలా తగులుగలకున్నాడేంటి ? 

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) ఫోటో నేలకేసి కొట్టి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు కు( Rayapati Rangarao ) ఇంకా టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పై ఆగ్రహం చల్లారినట్టుగా కనిపించడం లేదు.

ముఖ్యంగా లోకేష్ పై( Nara Lokesh ) తీవ్రస్థాయిలో రంగారావు విమర్శలు చేస్తున్నారు.

తాజాగా మరోసారి తన నోటికి పని చెప్పారు రంగారావు.కుటుంబాల్లో చిచ్చు పెట్టడం చంద్రబాబుకు అలవాటైన పనేనని, ఇప్పుడు తన కుటుంబం పై పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"చంద్రబాబు నాయుడు ఇంటర్నేషనల్ స్మగ్లర్.కరెప్షన్ కింగ్.

రాజకీయాల్లో అవినీతి చేయాలనుకునే వాళ్లకు ఆయన ఒక రిఫరెన్స్. """/" / ఇప్పుడు లోకేష్( Nara Lokesh ) కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నాడు.

పాదయాత్ర అయిపోయిన తర్వాత లోకేష్ డబ్బులు వసూలు చేసే పనిలో ఉన్నాడు '' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనపై విమర్శలు చేస్తున్న తమ కుటుంబానికి చెందిన రాయపాటి శైలజ కు( Rayapati Sailaja ) రంగారావు కౌంటర్ ఇచ్చారు.

చంద్రబాబు విజయవాడలో కేసినేని నాని కుటుంబంలో చిచ్చు పెట్టాడు.ఇప్పుడు మా కుటుంబంలో చిచ్చు పెట్టడానికి రాయపాటి శైలజ తో నాపై ఆరోపణలు చేయిస్తున్నాడు.

అసలు రాయపాటికి పార్టీలో సభ్యత్వం ఉందా ? అమరావతి ఉద్యమం పేరుతో ఎంతెంత వసూలు చేశారో ముందు రాయపాటి శైలజ చెప్పాలి.

"""/" / వసూలు చేసిన డబ్బులు ఎవరెవరి బ్యాంక్ అకౌంట్ లలోకి వెళ్ళాయో అంతా నాకు తెలుసు.

రాజకీయాల్లో చంద్రబాబు నిన్ను వాడుకుని వదిలేస్తాడంటూ శైలజకు రంగారావు కౌంటర్ ఇచ్చారు.ఇప్పటికే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన నుంచి 150 కోట్లు తీసుకున్నాడు అటూ రంగారావు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

రంగారావు అదే పనిగా టిడిపిని( TDP ) టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన చేసే విమర్శలు ఎన్నికల సమయంలో పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయనే ఆందోళన టిడిపి అగ్రనేతల్లో నెలకొంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై3, బుధవారం2024