కొత్త చిత్రానికి ముహూర్తం పెట్టేసిన మాస్ రాజా

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ క్రాక్ చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమా పూర్తిగాక ముందే తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

గతంలో రవితేజతో ‘వీర’ అనే సినిమాను తెరకెక్కించిన రమేష్ వర్మ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని ప్రారంభించేందుకు రవితేజ సిద్ధమయ్యాడు.

కాగా ఈ సినిమా గురించి గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నా, ఈ సినిమాపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.

అయితే అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ, ఈ సినిమా ముహూర్తం సమయం మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు.

ఈ సినిమా ముహూర్తం, ఫస్ట్ లుక్ రిలీజ్‌ను అక్టోబర్ 18న ఉదయం 11.

55 గంటలకు నిర్ణయించారు.కాగా ఈ సినిమా షూటింగ్‌ను నవంబర్ 2 నుండి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను మాస్ రాజా ప్రేక్షకులకు అన్ని విధాలా నచ్చేలా దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

ఇక రవితేజ కెరీర్‌లో 67వ చిత్రంగా రానున్న ఈ సినిమాలో ‘పెళ్లిచూపులు’ బ్యూటీ రీతూ వర్మను హీరోయిన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా రవితేజ నటిస్తున్న క్రాక్ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, సముథిరకని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ ముగించుకుని రమేష్ వర్మ చిత్రంలో పాల్గొనేందుకు రవితేజ ప్లాన్ చేస్తున్నాడు.

మరి రవితేజ కొత్త చిత్రం ఏ సబ్జెక్టుతో వస్తుందో చూడాలి అంటున్నారు అభిమానులు.

ఇదేందయ్యా ఇది.. పైకి పాకుతున్న నది నీరు.. వీడియో చూస్తే నమ్మలేరు..