ఆ డైరెక్టర్‌తో సినిమాను పక్కనబెట్టిన మాస్ రాజా

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే క్రాక్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన రవితేజ, తన నెక్ట్స్ చిత్రం ఖిలాడి షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటున్నాడు.

కాగా ఈ సినిమా తరువాత దర్శకుడు మారుతితో కలిసి రవితేజ ఓ సినిమా చేయాల్సి ఉంది.

ఇప్పటికే దానికి సంబంధించిన స్క్రిప్టు పనులు కూడా పూర్తయినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.

కాగా తాజాగా ఈ సినిమా అటకెక్కినట్లు తెలుస్తోంది.రవితేజ కోసం దర్శకుడు మారుతి ఓ అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేశాడట.

అయితే ఈ సినిమాను త్వరలో పట్టాలెక్కించేందుకు ఇద్దరు రెడీ అయ్యారు.కానీ ఈ సినిమా కోసం రవితేజ రూ.

12 కోట్లు రెమ్యునరేషన్‌గా డిమాండ్ చేశాడట.అయితే చిత్ర నిర్మాతలు రూ.

9 కోట్లు మాత్రమే చెల్లించేందుకు ముందుకు వచ్చారు.దీంతో హీరో, నిర్మాతల మధ్య మారుతి పలుమార్లు చర్చలు జరిపాడట.

కానీ రవితేజ తన రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గకపోవడంతో, తాము అంత ఇచ్చుకోలేమని చిత్ర నిర్మాతలు తేల్చేశారట.

దీంతో రవితేజ ఈ సినిమా చేయడం లేదని వారికి చెప్పేశాడు.ఇక చేసేది ఏమీ లేక మారుతి ఈ సినిమాలో వేరే హీరోను తీసుకునేందుకు రెడీ అయ్యాడు.

ఇప్పటికే మ్యాచో స్టార్ గోపీచంద్‌కు ఈ సినిమా కథను వినిపించాడట.అయితే గోపచంద్ ఈ సినిమాను ఇంకా ఓకే చేయలేదని తెలుస్తోంది.

అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

మొత్తానికి మారుతి దర్శకత్వంలో రవితేజ సినిమా చేస్తాడని ఆశించిన ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది.

ఇక రవితేజ నటిస్తున్న క్రాక్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఈ సినిమాలో రవితేజ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఏపీలో సమస్యత్మక నియోజకవర్గాలు ఇవేనా ? ఎన్నికల కమిషన్ ఏం చేయబోతోంది ?