మాస్ రాజాకు జోడిగా బుట్టబొమ్మ.. మరి అమ్మడు ఓకే చెబుతుందా?

మాస్ మహారాజా రవితేజ ( Ravi Teja ) గోపీచంద్ మలినేని కాంబో మరోసారి అఫిషియల్ అయ్యింది.

గోపీచంద్ మలినేనితో రవితేజ కొత్త మూవీ ఇటీవలే అనౌన్స్ చేసారు.మైత్రి మూవీస్ బ్యానర్ వారు ఈ కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తూ థమన్ సంగీతం అందిస్తున్నట్టు కూడా ప్రకటించారు.

అంతేకాదు మాసెస్ట్ కాంబో అంటూ పోస్టర్ రిలీజ్ చేయగా ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది.

"middlecontentim"/" / ఇక ఇప్పుడు ఒక్కొక్క పని పూర్తి చేస్తున్నట్టు అనిపిస్తుంది.తాజా టాక్ ప్రకారం హీరోయిన్ ఎంపికపై వర్క్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.

మాస్ రాజా సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డేను( Pooja Hegde ) సెట్ చేయాలని మేకర్స్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

మరి ఈ క్రమంలోనే టీమ్ ఇటీవలే పూజాను సంప్రదించినట్టు తెలుస్తుంది. """/" / అన్ని కుదిరితే ఈసారి బుట్టబొమ్మ మాస్ రాజాతో రొమాన్స్ చేయడం ఖాయం అంటున్నారు.

అయితే అందుకు పూజా హెగ్డే ఒప్పుకోవాలి.మరి పూజా తన పాత్ర నచ్చితే ఓకే లేకపోతే నో చెప్పే అవకాశం ఉంది.

ఇక ఈ కాంబో ఇప్పటికే మూడుసార్లు రాగా మూడుసార్లు బ్లాక్ బస్టర్ అయ్యింది.

ఇకఇప్పుడు క్రాక్ తర్వాత మరో సినిమాతో వీరు కలిసి పని చేయనున్నారు.ఇక రవితేజ ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు చేస్తుండగా ఈ మూవీ అక్టోబర్ 20న రిలీజ్ కాబోతుంది.

అలాగే ఇటీవలే దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో 'ఈగల్' సినిమా ( Eagle Movie )ప్రకటించాడు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది 2024 సంక్రాంతి టార్గెట్ గా రిలీజ్ కాబోతుంది.

అలాగే దీంతో పాటు గోపీచంద్ మలినేని సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకువెళ్లే అవకాశం ఉంది.

చూడాలి మరి షూట్ గురించిన అప్డేట్ ఎప్పుడు అందిస్తారో.

దిల్ రాజు రాస్తానన్న రేవు సినిమా రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?