రవితేజ ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్‌.. తర్వాత రాబోయేది ఏంటో!

మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ ఖిలాడీ మరియు రామారావు ఆన్ డ్యూటీ సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచిన విషయం తెలిసిందే.

ఆ రెండు సినిమా లు వరుసగా ఫ్లాప్ అవ్వడం తో రవితేజ తదుపరి సినిమా ఫ్లాప్ అవుతుందా లేదా సక్సెస్ అవుతుందా అనే విషయం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఫ్లాప్‌ ల హ్యాట్రిక్ ని తప్పించుకునేందుకు రవితేజ తన తదుపరి సినిమా ని కచ్చితంగా సూపర్ హిట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు.

అందుకే వరుసగా సినిమాలు విడుదల చేయకుండా ఆచి తూచి సినిమా ల విడుదల విషయం లో నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే ధమాకా సినిమాని.ఆ తర్వాత టైగర్ నాగేశ్వర రావు ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ధమాకా ముందు టైగర్ నాగేశ్వర రావు సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే బాగుంటుందని.

రవితేజ ఫ్లాపుల పరంపర కు టైగర్ నాగేశ్వర రావు అడ్డు కట్ట వేసే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు.

అందుకే ముందు టైగర్ నాగేశ్వర రావు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి సక్సెస్‌ దక్కించుకోవాలని, తద్వారా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ హిట్ కొట్టినట్టు అవుతుంది అంటూ ఆయన సన్నిహితులు మరియు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

"""/"/ టైగర్ నాగేశ్వర రావు సినిమా తర్వాత వస్తుందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోవడంతో రవితేజ అభిమానులు మరియు మీడియా వర్గాల వారు జుట్టు పీక్కుంటూ రవితేజ నటించిన ఏ సినిమా ఎప్పుడు వస్తుందో అర్థం కావటం లేదని అసహనంతో రవితేజ పై కామెంట్స్ చేస్తున్నారు.

రవితేజ రాక్షసుడు కూడా విడుదలకు లైన్ లోనే ఉంది.

దసరా సినిమాలకు హిట్ టాక్.. ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీకి కలిసొచ్చినట్టేనా?