రేషన్ బియ్యం పట్టివేత…!

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల మండలం కల్మలచెరువు గ్రామం నుండి తక్కువ ధరకు రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్న 12 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని,రెండు ఆటోలను పాలకవీడు పోలీసులు శనవారం పట్టుబడి చేశారు.

మిర్యాలగూడకు చెందిన బంటు వెంకటేశ్వర్లు ఆటోలో 10 క్వింటాళ్ల బియ్యం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన చల్ల మల్లికార్జునరావు ఆటోలో రెండు క్వింటాళ్ళ బియ్యం తరలిస్తుండగా పట్టుబడి చేసి,బియ్యాన్ని ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు పాలకవీడు ఎస్సై సైదులు గౌడ్ తెలిపారు.

రైల్వే స్టేషన్‌లో స్టంట్ చేస్తూ ఒక కాలు, ఒక చేయి పోగొట్టుకున్న యువకుడు..