బిగ్‌బాస్ : ఏదో విధంగా రతిక బాగానే పాపులర్ అయ్యింది

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 కి( Bigg Boss 7 ) గ్లామర్ తెచ్చి పెట్టిన అమ్మాయి రతిక రోజ్‌ అనడంలో సందేహం లేదు.

ఉన్నది కొన్ని వారాలే అయినా కూడా ఆమె చూపించిన షేడ్స్ అన్నీ ఇన్నీ కావు.

బాబోయ్‌ ఆడవారు ఇలాగే ఉంటారు, అమ్మాయిలు ఇలాగే ప్రవర్తిస్తున్నారు అంటూ తెగ మాట్లాడుకునేలా చేసింది.

సోషల్‌ మీడియా లో ఉన్న వారికి రతిక ( Rathika ) చాలా పని కల్పించింది.

అంతే కాకుండా రతిక వల్ల మీమర్స్ కి కూడా చాలా పని దొరికింది అనడంలో సందేహం లేదు.

మొత్తానికి రతిక విమర్శలు ఎదుర్కొన్నా కూడా పాపులారిటీ ని మాత్రం భారీగానే దక్కించుకుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఉన్న రతిక నెగిటివిటీని కూడా తనకు అనుకూలంగా మార్చేసుకుంటుంది. """/" / తాజాగా సోషల్‌ మీడియాలో రతిక ఒక పోస్ట్‌ లో ప్రశాంత్‌( Pallavi Prashanth ) మరియు శివాజీ( Sivaji ) ల గురించి చెప్పుకొచ్చింది.

వారిద్దరు తన గురించి మాట్లాడుకుంటున్నారు.వారు ఇద్దరు నన్ను మిస్ అవుతున్నారు.

అలాగే నేను కూడా ఆమెను మిస్ అవుతున్నాను అన్నట్లుగా రతిక పోస్ట్‌ లో పేర్కొంది.

మొత్తానికి సోషల్‌ మీడియా లో రతిక షేర్ చేసిన పోస్ట్‌ తో మళ్లీ వార్తల్లో నిలిచింది.

రతిక ఏదో విధంగా పాపులర్ అయితే చాలు అన్నట్లుగా భావించినట్లుగా ఉంది.అందుకే బిగ్‌ బాస్ లో ఉన్న సమయం లో గందరగోళం గా వ్యవహరించింది.

"""/" / ఇప్పుడు అలాగే గందరగోళంగా వ్యవహరిస్తుంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

రతిక వ్యవహారం ను కొంత మంది అమ్మాయిలు కూడా తప్పుబట్టారు.అమాయకుడు.

పల్లెటూరు వాడు అయిన పల్లవి ప్రశాంత్ ని రతిక ఆడుకున్న తీరు.అతడిని ఆడేసుకున్న తీరు ను చాలా మంది విమర్శించారు.

ఎవడ్రా నువ్వు.సిగ్గు ఉందా అంటూ పల్లవి ప్రశాంత్‌ ని ఒకానొక సమయంలో పీక్స్ కి వెళ్లి మరీ రతిక తిట్టింది.

అందుకే ఆమె బయట ఉందని కొందరు విమర్శిస్తున్నారు.అయినా కూడా రతిక తన తీరు మార్చుకోకుండా పల్లవి ప్రశాంత్ ని బయటకు వచ్చి కూడా టార్గెట్ చేస్తూనే ఉంది.

అలా చేయడం వల్ల పాపులారిటీ వస్తుందని ఆమె నమ్ముతోంది.

మెగా ఫ్యామిలీకి దూరంగా అల్లు అర్జున్… ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చిన బన్నీ!