రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కి సన్మానం..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షునిగా ఎంపిక అయినటువంటి ఎలుసాని మోహన్ కుమార్ ని రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది.

ఈ సన్మాన కార్యక్రమంలో బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి , సిరిసిల్ల పాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్, బొప్పాపూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండా రమేష్ గౌడ్ , లయన్స్ క్లబ్ జిల్లా కేబినెట్ మెంబెర్ వంగాల రవీందర్ , జ్ఞానదీప్ విద్యా సంస్థ చైర్మన్ లక్ష్మి నారాయణ ,రాజన్న పేట మాజీ ఎంపీటీసీ నమిలికొండ శ్రీనివాస్ ,బిఆర్ఎస్ నాయకులు బొమ్మనవేని కృష్ణ , శివ రెడ్డి , ఆర్.

ఎం.పి సుధాకర్ గౌడ్ ,ప్రవీణ్ రెడ్డి , నిమ్మల కిషన్ ,జనగామ శేఖర్ , తదితరులు పాల్గొన్నారు.

వృద్ధురాలే కానీ బ్రెడ్ పకోడీలు ఎంత ఫాస్ట్‌గా చేస్తుందో చూస్తే..??