రౌడీ స్టార్‌ను చూసి జడుసుకున్న రష్మిక

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న టాలీవుడ్‌లో ఛలో సినిమాతో తెరంగేట్రం చేసి అందరిచూపులు తనవైపు తిప్పుకుంది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకోవడంతో వెంటనే గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో టాలీవుడ్‌ను షేక్ చేసింది ఈ బ్యూటీ.

గీతాగోవిందం చిత్రం బాక్సాఫీస్ బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలవడంతో రష్మిక ఒక్కసారిగా స్టార్ స్టేటస్‌ను అందుకుంది.

ఇక వెంటనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటించేసింది ఈ బ్యూటీ.

ఇక సరిలేరు నీకెవ్వరు కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ మూవీగా నిలవడంతో ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటిస్తోంది.

కాగా ఈ బ్యూటీ ఇటీవల తన ఫ్యాన్స్‌తో ముచ్చటించినప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.

టాలీవుడ్‌లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అంటే జడుసుకునేదని చాలా తక్కువ మందికి తెలుసని అంటోంది.

తనకు కొత్త వ్యక్తులను చూసినప్పుడు భయం వేస్తోందని, విజయ్ దేవరకొండ విషయంలోనూ అదే జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది.

తొలుత విజయ్ దేవరకొండను చూసినప్పుడు చాలా భయపడ్డానని, కానీ అతను చాలా కూల్‌గా ఉండటంతో అతడితో స్నేహం చేశానని ఆమె చెప్పుకొచ్చింది.

విజయ్ దేవరకొండతో ప్రయాణం చాలా సులభంగా ఉంటుందని ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.

అందుకే అతడితో రెండు సినిమాలు చేయగలిగానని ఆమె అంటోంది.ఇక తమ స్నేహం అప్పటి నుండి మరింత బలపడిందని ఆమె చెప్పుకొచ్చింది.

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫైటర్ చిత్రంతో బాలీవుడ్‌లోనూ అడుగుపెడుతుందడటం చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది.

ఇలా తన మనసులోని మాటలను ఇలా ఫ్యాన్స్‌తో పంచుకుంది ఈ కన్నడ బ్యూటీ.

కొత్త హీరోలకు సాధ్యం కానీ ఆ ఒక్కటి స్టార్ హీరోల వల్ల మాత్రమే అవుతుంది… ఎందుకు..?