పుష్ప2 లో రష్మిక మందన్న చేస్తుందా.. ఇదిగో నిర్మాత ఫుల్ క్లారిటీ?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం పుష్ప.

ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్త పాన్ ఇండియా స్టార్ అల్లుఅర్జున్ గా మారిన విషయం తెలిసిందే.

ఈ సినిమా విడుదల అయిన తర్వాత ఇందులోని పాటలు డైలాగులు ఎక్కడ చూసినా కూడా మార్మోగి పోయాయి.

సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి.మరీ ముఖ్యంగా ఈ సినిమాలో తగ్గేదేలే అన్న డైలాగ్ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ డైలాగ్ ని ఉపయోగిస్తున్నారు.

సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఈ డైలాగ్ ని ఇంకా ఎవరు మర్చిపోవడం లేదు.

ఈ ఒక్క డైలాగ్ తో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అందరూ కూడా ఫిదా అయ్యారు.

ఇక ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక మందన తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఈ సినిమాలో రష్మిక మందన్న, అల్లు అర్జున్ ల మధ్య సీన్ లు, పాటలు కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిన విషయం తెలిసిందే.

"""/" / ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.

ఇకపోతే పుష్ప సినిమా మొదటి పార్ట్ లో అలరించిన శ్రీవల్లి పాత్ర సెకండ్ పార్ట్ లో మాత్రం చనిపోతుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ వార్తలపై నిర్మాత రవిశంకర్ స్పందించారు.అదంతా చెత్త.

నాన్సెన్స్.అసలు పుష్ప 2 సినిమా కథ ఏంటి అనేది మాకే సరిగా తెలియదు అవన్నీ ఊహాగానాలే అంటూ ఆ వార్తలను కొట్టిపారేశారు రవిశంకర్.

సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు ఎటువంటి నిజం లేదని, అవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే అని తెలిపారు.

ఇకపోతే పుష్ప 2 సినిమాకు సంబంధించిన షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

డిసెంబర్లో సినిమాను విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.పుష్ప సినిమా పార్ట్ 2 నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్లు సమాచారం.

అక్కవరంలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ