బాలీవుడ్ లో మరో ఆఫర్ పట్టేసిన శ్రీవల్లి.. అక్కడ కూడా బిజీ కానుందా?

గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న ను నేషనల్ క్రష్ గా అభిమానులు ఎంతో అభిమానంగా పిలుచు కుంటారు.

ఈమె నిన్న మొన్నటి వరకు సౌత్ హీరోయిన్ గా మాత్రమే అందరికి తెలుసు.

అయితే పుష్ప సినిమా స్టార్ట్ అయిన తర్వాత నుండి రష్మిక మెల్లమెల్లగా అంతటా గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుని పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పోయింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా రిలీజ్ అయినా తర్వాత ఈ బ్యూటీ కి మరింత పాపులారిటీ పెరిగింది.

ఈమె ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.ఆ తర్వాత గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరూ, భీష్మ సినిమాలతో వరుస హిట్స్ అందుకుంటూ సక్సెస్ రేట్ కూడా పెంచుకుంది.

"""/"/ ఇక పుష్ప సినిమా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

పుష్ప సినిమాతో బాలీవుడ్ లో బాగా పాపులారిటీ తెచ్చుకుని ఇప్పుడు అక్కడ కూడా వరుస ఆఫర్స్ అందుకుంటుంది.

ఇప్పటికే ఈమె టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లలో కూడా వరుస సినిమాలు చేస్తుంది.

"""/"/ ఇక తాజాగా ఈమెకు మరొక బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.ఈమె ఇటీవలే ముంబై లో కనిపించిన విషయం విదితమే.

బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ను కలిసి నట్టుగా కూడా సమాచారం.

దీంతో ఈ బ్యూటీ కరణ్ జోహార్ నెక్స్ట్ నిర్మిస్తున్న తదుపరి సినిమా లో నటించనున్నట్టు ప్రచారం జరుగుతుందట ఇప్పటికే బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్న ఈమె ఇప్పుడు మరొక అవకాశం కూడా అందుకున్నట్టు తెలుస్తుంది.

మరి ఈ అమ్మడి జోరు చూస్తుంటే అక్కడ కూడా బిజీ హీరోయిన్ గా చక్రం తిప్పబోతున్నట్టు కనిపిస్తుంది.

మే 1న ఇంటింటికీ పెన్షన్లు ఇచ్చేలా చూడాలని చంద్రబాబు లేఖ..!!