ఆషిఖి-3 లో నేషనల్ క్రష్.. అమ్మడి లక్ మాములుగా లేదుగా!

గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న ను నేషనల్ క్రష్ గా అభిమానులు ఎంతో అభిమానంగా పిలుచు కుంటారు.

ఈమె నిన్న మొన్నటి వరకు సౌత్ హీరోయిన్ గా మాత్రమే అందరికి తెలుసు.

అయితే పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి రష్మిక మెల్లమెల్లగా అంతటా గుర్తింపు తెచ్చుకుంది.

దీంతో బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుని పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పోయింది.

ఈ మధ్యనే దుల్కర్ సల్మాన్ సీతా రామం లో అతిథి పాత్రలో మెరిసింది.

ఈ సినిమాలో ఈమె కీలక పాత్ర పోషించి నటిగా తనని తాను మరోసారి నిరూపించుకుంది.

ఇక ప్రెసెంట్ రష్మిక చేతిలో మిషన్ మజ్ను, గుడ్ బై, తో పాటు తెలుగులో పుష్ప 2, వంశీ పైడిపల్లి, విజయ్ సినిమా ఉన్నాయి.

చేతిలో ఇన్ని సినిమాలు ఉన్న కూడా ఇంక కొత్త కొత్త అవకాశాలు వరిస్తూనే ఉన్నాయి.

ముఖ్యంగా బాలీవుడ్ లో చాలా ప్రోజెక్టుల కోసం ఈ అమ్మడి పేరు వినిపిస్తుంది.

తాజాగా మరొక బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ కోసం ఈ అమ్మడి పేరు వినిపిస్తుంది.

ఆషిఖి, ఆషిఖి 2 బాలీవుడ్ లో పెద్ద సక్సెస్ అవ్వడమే కాకుండా యువతరాన్ని బాగా ఆకట్టు కున్నాయి.

"""/" / ఇక ఇప్పుడు ఆషిఖి 3 కోసం సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారో అని బాలీవుడ్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపించగా ఇప్పుడు రష్మిక పేరు వినిపిస్తుంది.

దీంతో ఈ సినిమా అవకాశం అందుకుంటే ఇక ఈమె బాలీవుడ్ లో పాతుకు పోయినట్టే అని అనుకుంటున్నారు.

చిన్నారికి ఆస్పత్రిలో చికిత్స చేయించిన బాలయ్య.. మంచి మనస్సున్న హీరో అంటూ?