పారితోషికం ఎక్కువ అవ్వడం వల్లే రష్మిక ఓకే చెప్పిందా?

ఒకప్పుడు హీరోయిన్ పాత్రలు చేసే వాళ్ళు వ్యాంపు పాత్రలు చేసే వాళ్ళు వేరే వేరు ఉండేవారు.

కానీ కాలక్రమం లో సినిమా కమర్షియల్ హంగులు దిద్దుకుంటున్న నేపథ్యం లో హీరోయిన్స్ వ్యాంపు పాత్రలు చేసేందుకు ఓకే చెబుతున్నారు.

అప్పుడు వ్యాంపు పాత్రలు ఇప్పుడు ఐటెం సాంగ్స్ గా మారాయి.టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్నిచోట్ల కూడా హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

బాలీవుడ్ లో మొదలైన ఈ పద్ధతి ప్రస్తుతం అన్ని భాషల్లో కూడా కొనసాగుతోంది.

ఎంతటి పెద్ద స్టార్ హీరోయిన్ అయినా కూడా ఐటెం సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న రష్మిక మందనా ఐటెం సాంగ్ చేసేందుకు ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి.

"""/"/ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా లో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆమెతో పాటు రష్మిక మందన కీలక పాత్రలో నటిస్తుందని వార్తలు వచ్చాయి.కానీ ఆమె చేస్తున్నది కీలక పాత్ర కాదని.

ఐటెం సాంగ్ చేస్తుందని సమాచారం.ప్రస్తుతం ఆమె ఐటం సాంగ్‌ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

భారీ పారితోషం ఇచ్చేందుకు ఫిల్మ్ మేకర్స్ ఓకే చెప్పడం వల్లే రష్మిక మందనా ఐటమ్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

హీరోయిన్‌ రష్మిక మందన్నా మాత్రమే కాకుండా మరింత మంది హీరోయిన్‌ కూడా భారీ పారితోషికం ఇస్తే ఐటెం సాంగ్స్ చేసేందుకు ఓకే చెప్తున్నారు.

కనుక ముందు ముందు మరింత మంది స్టార్ హీరోయిన్స్ కూడా ఐటం సాంగ్స్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది.

ఉద్యోగులు, నిరుద్యోగులకు చంద్రబాబు సంచలన హామీలు..!!