ఈ టైంలో జబర్దస్త్‌ రష్మి చేస్తున్న పనికి ప్రతి ఒక్కరు సెల్యూట్‌ చేయాల్సిందే

జబర్దస్త్‌ యాంకర్‌ రష్మి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.అయితే ఈమెను ఎప్పుడు విమర్శించేవాళ్లే తప్ప ఎక్కువ శాతం అభినందించే వారు తక్కువగా ఉంటారు.

ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా తనను అభినందించే పని చేస్తుంది రష్మి.

ఈ యాంకర్‌ ప్రస్తుతం రోడ్ల మీద తిండి లేక ఇబ్బంది పడుతున్న జంతువులకు ఆహారం ఇస్తుంది.

కుక్కలు ఇతర జంతువుల పరిస్థితి కరోనాతో దారుణంగా ఉంది.రోడ్డు మీద తిండి దొరకక చాలా జంతువులు మృతి చెందుతున్నాయి.

"""/"/ఈ సమయంలో రష్మి గౌతమ్‌ స్పందించింది.తన మంచి మనసును చాటుకుంది.

ఇటీవల సోషల్‌ మీడియాలో కరోనా విపత్తుపై మాట్లాడుతూ ఆమె ఏకంగా కన్నీరు పెట్టుకుంది.

నిజానికి రష్మి హృదయం చాలా సున్నితం.ఆమె ఏదైనా కార్యక్రమంలో ఎమోషనల్‌ సీన్‌ వచ్చినా కూడా చాలా ఎమోషనల్‌ అయ్యి కన్నీరు పెట్టుకోవడం మనం పలు కార్యక్రమాల్లో చూశాం.

ఇప్పుడు రష్మి కరోనాతో కంటి మీద కునుకు లేకుండా బాధపడుతున్నట్లుగా ఆమె మాటల ద్వారా తెలుస్తోంది.

ఈ సమయంలో ప్రతి ఒక్కరు సాయం చేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేసిన రష్మి మాటలకే పరిమితం అవ్వకుండా ఒక స్వచ్చంద సంస్థతో కలిసి ముందడుగు వేసింది.

వారితో కలిసి రోడ్ల మీద తిరుగుతూ జంతువులకు మరియు రోడ్డున ఉన్న పేదవారి కడుపు నింపుతోంది.

ఈ పనితో ఆమె ఒక్కసారిగా గొప్ప వ్యక్తి అయ్యింది.ఆమెపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

నిజంగా రష్మి చేస్తున్న దానికి సెల్యూట్‌ చేసినా తక్కువే అంటూ ఆమెకు ప్రశంసలు కురిపిస్తున్నారు.

బీహార్‌లో మిస్టీరియస్ గుహ.. దీని చరిత్ర తెలిస్తే వణికి పోతారు..??