నెటిజన్ ను అడ్రస్ అడిగిన రష్మి.. మ్యాటర్ ఏంటంటే?
TeluguStop.com
బుల్లి తెరపై స్టార్ యాంకర్లుగా గుర్తింపు తెచ్చుకున్న అతి కొద్ది మందిలో రష్మీ గౌతమ్ ఒకరు.
జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన ఈ యాంకర్ పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించారు.
జంతు ప్రేమికురాలైన రష్మి సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు.
సామాజిక అంశాల గురించి రష్మి గౌతమ్ ఎక్కువగా స్పందిస్తూ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటారు.
తాజాగా ఒక నెటిజన్ రష్మి గౌతమ్ తో తన సమస్యను చెప్పుకున్నాడు.అక్కా అని పిలుస్తూ తన కష్టాన్ని పరిష్కరించాలని కోరాడు.
నెటిజన్ కోరిక విన్న రష్మి గౌతమ్ వెంటనే చలించిపోయింది.గురించి నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.
లేడీ సోనూసూద్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.పూర్తి వివరాల్లోకి వెళితే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న ఒక నిరుద్యోగి కరోనా, లాక్ డౌన్ వల్ల తాను చాలా ఇబ్బందులు పడుతున్నానని.
తన దగ్గర పుస్తకాలు కొనుకోవడానికి కూడా డబ్బులు లేవని.డిసెంబర్ నెలలో జరిగే పరీక్ష కొరకు కొన్ని పుస్తకాలు అవసరమని.
ఆ పుస్తకాలను కొనడానికి తగిన సాయం చేయాలని కోరాడు.అక్కగా పుస్తకాలకు సహాయం చేసి సక్సెస్ సాధించడానికి సహాయపడాలని అభ్యర్థించాడు.
ఆ సందేశాన్ని చూసిన వెంటనే రష్మి స్పందించింది.పుస్తకాల పేర్లు, అడ్రస్ చెబితే వాటిని స్వయంగా తానే కొని పంపిస్తానని రష్మి నెటిజన్ కు జవాబిచ్చింది.
రష్మి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుతం మూడు షోలతో బిజీగా ఉన్న రష్మి నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా త్వరలో విడుదల కానుంది.
హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం.. వాహనదారుల ఇక్కట్లు